టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం ప్రారంభం
ABN , First Publish Date - 2022-03-03T17:37:37+05:30 IST
టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది.
అమరావతి: టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో టీడీపీ మహానాడు, ఎన్టీఆర్ శత జయంతి, సభ్యత్వ నమోదు, 40వ ఆవిర్భావ దినోత్సవం, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. తాజాగా వచ్చిన హైకోర్టు తీర్పుపై చర్చించే అవకాశం ఉంది. అలాగే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా వద్దా.. అనే విషయంపై కూడా చర్చ జరుగనుంది. ఈ అంశంపై పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.