పశువుల్లా వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు: Anagani

ABN , First Publish Date - 2021-11-20T17:34:58+05:30 IST

అసెంబ్లీలో నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు పశువుల్లా మాట్లాడారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విరుచుకుపడ్డారు.

పశువుల్లా వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు: Anagani

అమరావతి: అసెంబ్లీలో నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు పశువుల్లా మాట్లాడారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, భువనేశ్వరి తమకు తల్లిదండ్రుల్లాంటి వరన్నారు. భువనేశ్వరి గురించి కొడాలి నాని  మాట్లాడటం ఏంటని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. వివేకా హత్య గురించి అసెంబ్లీలో మాట్లాడాలి అని అడగటం తప్పా అని ప్రశ్నించారు. సభ్య సమాజం తలదించుకునేలా వైసీపీ నేతల మాటలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ పుట్టుకపై చరించాలి అని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎలా అంటారని మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రతి ఒక్కరు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. నిన్న అసెంబ్లీలో వైసీపీ వాళ్ళు అన్నీ మాట్లాడి.... రికార్డ్స్‌లో లేకుండా డిలీట్ చేశారని అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 

Updated Date - 2021-11-20T17:34:58+05:30 IST