చంద్రబాబు సవాల్‌కు జగన్ పారిపోయాడు: టీడీపీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-08-06T22:51:05+05:30 IST

ఓటమి భయంతోనే జగన్ చంద్రబాబు సవాల్‌కు పారిపోయాడని టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు సవాల్‌కు జగన్ పారిపోయాడు: టీడీపీ ఎమ్మెల్యే

ప్రకాశం: ఓటమి భయంతోనే జగన్ చంద్రబాబు సవాల్‌కు పారిపోయాడని టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పాలనలో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించాలని రైతుల దగ్గర నుండి 33 వేల ఎకరాల భూమిని సేకరించి నిర్మాణాలు చేపట్టామన్నారు. అవినీతి పెరు చెప్పి అభివృద్దిని ఆపివేయడమే కాక కులాన్ని, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి రాజధానిని మార్చడం కుట్ర పూరిత రాజకీయానికి నిదర్శనమి మండిపడ్డారు. చంద్రబాబుకి మంచి పేరొస్తుందనే భయం తోనే రాజధానిని మారుస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మీద అక్కసుతో ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రివర్స్ టెండర్లు ద్వారా ప్రజల సొమ్ము పొదుపు చేస్తానని చెప్పే మీరు ఇప్పటి వరకు అమరావతిలో 


ఖర్చు చేసిన ప్రజల సొమ్ముకు ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. ఈ నష్టానికి వైసీపీనే భాద్యత వహించాలన్నారు.  మూడు రాజధానులే మీ నిర్ణయమైతే ప్రజామోదం పొందాల్సిన భాద్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. ప్రజా రాజధానిని నిర్ణయించడానికి ప్రజల దగ్గరికెళ్లడానికి ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగ పరచకుండా 29 వేల మంది రైతుల కన్నీళ్లు తుడిచి అందరికీ అందుబాటులో ఉండే రాజధానిగా అమరావతిని కొనసాగించాలని సూచించారు. 

Updated Date - 2020-08-06T22:51:05+05:30 IST