కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడింది: ఎమ్మెల్యే డోలా

ABN , First Publish Date - 2021-11-18T02:12:53+05:30 IST

అధికార దుర్వినియోగం, అవినీతి, ధన ప్రవాహం వల్లే కుప్పంలో

కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడింది: ఎమ్మెల్యే  డోలా

అమరావతి: అధికార దుర్వినియోగం, అవినీతి, ధన ప్రవాహం వల్లే కుప్పంలో వైసీపీ గెలిచిందని టీడీపీ ఎమ్మెల్యే  డోలా బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు. కుప్పంలో  ప్రజాస్వామ్యం ఓడిందన్నారు. ప్రజామోదం లేకున్నా పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి  మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన వైసీపీ సంబరాలు చేసుకోవటం సిగ్గుచేటన్నారు. పక్క నియోజకవర్గాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి సైతం దొంగ ఓటర్లను తీసుకువచ్చి కుప్పంలో దొంగ ఓట్లు వేయించిన ఘనత మంత్రి పెద్దిరెడ్డిదేనని ఆయన ఎద్దేవా చేశారు. కుప్పంలో వైసీపీ గెలిచినప్పటికీ నైతిక విజయం మాత్రం టీడీపీదేనని రాష్ట్ర  ప్రజలే అంటున్నారని ఆయన పేర్కొన్నారు. 



Updated Date - 2021-11-18T02:12:53+05:30 IST