విద్యావ్యవస్థ భ్రష్టు పట్టింది: ఎమ్మెల్యే నిమ్మల

ABN , First Publish Date - 2021-11-30T21:53:20+05:30 IST

సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల

విద్యావ్యవస్థ భ్రష్టు పట్టింది: ఎమ్మెల్యే నిమ్మల

అమరావతి: సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్‌రెడ్డి నిర్వాకంతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందన్నారు. నాణ్యమైన విద్యలభించే రాష్ట్రాల జాబితాలో గతంలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం, ఇప్పుడు 19వ స్థానానికి చేరిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మద్యంపై ఆదాయం వస్తుందని దాన్ని జగన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నారు. కానీ వ్యవసాయంపై ఆదాయం లేదని రాష్రంలో వరి వేయొద్దనే దుస్థితికి దిగజారిందని ఎమ్మెల్యే నిమ్మల ఆరోపించారు. 



Updated Date - 2021-11-30T21:53:20+05:30 IST