జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే కుమారులు

ABN , First Publish Date - 2020-09-19T21:04:18+05:30 IST

విశాఖ సౌత్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే కుమారులు

అమరావతి : విశాఖ సౌత్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. గత కొన్ని రోజులుగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన.. శనివారం నాడు తన కుమారులతో కలిసి సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లి జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాసుపల్లి కుమారులకు కండువా కప్పిన సీఎం జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గణేష్.. తన కుమారులు వైసీపీలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎంపీ విజయసాయిరెడ్డి, కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నారు.



Updated Date - 2020-09-19T21:04:18+05:30 IST