వైసీపీ మద్దతుదారునిగా టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి?

ABN , First Publish Date - 2020-09-19T09:24:38+05:30 IST

తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు, విశాఖ దక్షిణం నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ వైసీపీ మద్దతుదారునిగా మారబోతున్నట్టు విశ్వసనీ

వైసీపీ మద్దతుదారునిగా టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి?

నేడు జగన్‌ను కలిసే అవకాశం

విశాఖపట్నం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు, విశాఖ దక్షిణం నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ వైసీపీ మద్దతుదారునిగా మారబోతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. చాలాకాలంగా ఆయన పార్టీ మారతారని ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ ఎప్పుడూ బయట పడలేదు. తన వ్యాపార అవసరాల రీత్యా ఆయన వైసీపీకి దగ్గరవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొద్దికాలంగా ఆయన టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.


ఇంతకు ముందు వైసీపీ  ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న రీతిలో ధర్నాలు నిర్వహించేవారు. ఇటీవల అటువంటివేమీ చేపట్టడం లేదు. వైసీపీలో చేరాలనే ఆలోచన వచ్చిన తరువాత ఆయన విశాఖలో ఆ పార్టీ ప్రతినిధి విజయసాయిరెడ్డిని కలిసి మాట్లాడినట్టు సమాచారం. ముహూర్తం పెట్టుకొని శనివారం అమరావతిలో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ని కలిసి ఆ పార్టీకి తన మద్దతు ప్రకటిస్తారని సమాచారం.


ఇందుకోసం ఆయన శుక్రవారం సాయంత్రమే అమరాతికి బయలుదేరినట్టు తెలుస్తోంది. ఆయన వెంట ఆయన కుమారుడు వున్నట్టు చెబుతున్నారు. బహుశా ఆయన కుమారుడికి వైసీపీ కండువా కప్పిస్తారంటున్నారు.  

Updated Date - 2020-09-19T09:24:38+05:30 IST