టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి ఆరోగ్య పరిస్థితి విషమం

ABN , First Publish Date - 2020-12-03T23:36:10+05:30 IST

ఏపీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా రెండో విడత కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోండడంతో ప్రజలు భయపడుతున్నారు.

టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి ఆరోగ్య పరిస్థితి విషమం

విజయవాడ:  ఏపీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. మొదట్లో ప్రజలు, నాయకులు జాగ్రత్తలు పాటించినప్పటికీ రెండో విడత మాత్రం నిర్లక్ష్యం చేస్తుండడంతో కరోనా కేసులు పెరుగుతున్నాయి.  తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి రెండోసారి కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చిందని వైద్యులు తెలిపారు. దీంతో టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది.  ఆయన ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేశారు. రెండో విడత తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోండడంతో ప్రజలు, నాయకులు భయపడుతున్నారు. నాయకులపై కూడా ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది. వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే‌కు కూడా కరోనా సోకడంతో అతనితో పాటు తిరిగిన నేతలు కూడా హోంక్వారంటైన్ లోకి వెళ్లారని సమాచారం. మధ్యలో కొంచెం  కరోనా కేసులు తగ్గాయి. కానీ, గత కొన్ని రోజులుగా మళ్లీ అంతకంతకు కొత్త కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. 

Updated Date - 2020-12-03T23:36:10+05:30 IST