ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలి: కనకమేడల
ABN , First Publish Date - 2021-12-03T20:21:04+05:30 IST
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని టీడీపీ ఎంపీ కనకమేడల డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి.. మాటమార్చారన్నారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇప్పటి వరకు రాలేదన్నారు. రాజ్యసభలో ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సోమ్ ప్రకాశ్ సమాధానం ఇచ్చారు. ఏపీకి ఇప్పటికే స్పెషల్ ప్యాకేజీ కింద అనేక ప్రాజెక్టులను మంజూరు చేశామన్నారు.