కేసీఆర్, జగన్, షర్మిలది ట్రై యాంగిల్ బిజినెస్ స్టోరీ: ఎంపీ కేశినేని

ABN , First Publish Date - 2021-07-11T17:59:58+05:30 IST

కేసీఆర్, జగన్, షర్మిలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కేసీఆర్, జగన్, షర్మిలది ట్రై యాంగిల్ బిజినెస్ స్టోరీ: ఎంపీ కేశినేని

విజయవాడ: కేసీఆర్, జగన్, షర్మిలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్, జగన్, షర్మిలది ట్రై యాంగిల్ బిజినెస్ స్టోరీ అని అన్నారు. ముగ్గురూ ఒకటే అని... రెండు రాష్ట్రాలు దోచుకోవడానికి ముగ్గురూ కలసి నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కేసీఆర్, జగన్ అన్ని రకాలుగా సహకరించుకున్నారని అన్నారు. కేసీఆర్, జగన్ ఒకటే..ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకమని వ్యాఖ్యానించారు. జగన్ ఆస్తులు, పెట్టుబడులు హైదరాబాద్‌లో ఉన్నాయని..అందుకే కేసీఆర్‌కు జగన్ సరెండర్ అయ్యారని అన్నారు.  ఆ విషయం ప్రజలకు కూడా అర్థం అవుతుందని ఆయన తెలిపారు. కేసీఆర్ నీటి వాటాలు కోసం సవాల్ చేస్తుంటే జగన్ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. తాము ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు, హక్కుల కోసం పోరాటం చేయాల్సింది జగన్, వైసీపీ నేతలే అని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-07-11T17:59:58+05:30 IST