పోరు.. హోరు!

ABN , First Publish Date - 2021-10-23T05:13:27+05:30 IST

టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఆ పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కార్యాలయంపై వైసీపీ మూకల దాడికి నిరసనగా పార్టీ అధి నేత చంద్రబాబు చేపట్టిన దీక్షకు మద్దతుగా నిలిచారు.

పోరు.. హోరు!
36 గంటల దీక్ష ముగిసిన అనంతరం అభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న చంద్రబాబునాయుడు

కదలి వచ్చిన టీడీపీ శ్రేణులు

కిక్కిరిసిన టీడీపీ కేంద్ర కార్యాలయం

చంద్రబాబుకు బాసటగా నిలిచిన తమ్ముళ్లు

పెద్దసంఖ్యలో హాజరైన జిల్లా నేతలు 

వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదంటూ స్పష్టీకరణ


గుంటూరు, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఆ పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కార్యాలయంపై వైసీపీ మూకల దాడికి నిరసనగా పార్టీ అధి నేత చంద్రబాబు చేపట్టిన దీక్షకు మద్దతుగా నిలిచారు. వివిధ జిల్లాల నుంచి భారీ ర్యాలీల తో టీడీపీ నేతలు చేరుకోవటంతో ఎన్టీఆర్‌ భవన్‌ కిక్కిరిసిపోయింది. జిల్లా టీడీపీ నేతలు రెండ్రోజుల పాటు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్దనే ఉన్నారు. శుక్రవారం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఆధ్వర్యంలో దా దాపు 300 కార్లతో కార్య కర్తలు చంద్రబాబు దీక్ష వద్దకు తరలి వచ్చారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని భారీ ర్యాలీగా దీక్షా స్థలికి చేరుకున్నారు. అలాగే హిందూపురం, అనంతపురం, నెల్లూరు, తూర్పు, పశ్చిమ గోదావరి ఇలా రాష్ట్రం నలుమూల నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు తరలి రావటంతో అక్కడ కోలాహల వాతావరణం నెలకొంది. మరోవైపు నేతలు తమ ప్రసంగాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సా హాన్ని నింపారు. 



--==============================================================================================

Updated Date - 2021-10-23T05:13:27+05:30 IST