మహానాడులో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా లోకేశ్
ABN , First Publish Date - 2020-05-27T22:58:16+05:30 IST
టీడీపీ డిజిటల్ మహానాడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైతే... మహానాడుకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలిచారు.
అమరావతి: టీడీపీ డిజిటల్ మహానాడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైతే... మహానాడుకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలిచారు. గతంలో కాస్త లావుగా కనిపించిన ఆయన.. ప్రస్తుతం స్లిమ్గా ప్రత్యక్షమయ్యారు. లోకేశ్ బరువు తగ్గడంపై మహానాడులో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు లావుగా ఉన్న ఆయనపై ప్రత్యర్థులు విమర్శలు చేసేవారు. బాడీ షేమింగ్కు పాల్పడేవారు. అయితే వాటిని పాజిటివ్ తీసుకునే వారు లోకేశ్. లాక్డౌన్తో హైదరాబాద్లో చిక్కుకుపోయిన ఆయన... ఈ సమయాన్ని బరువు తగ్గడానికి ఉపయోగించుకున్నారు. కఠోర వ్యాయామం, మితఆహారం తీసుకుంటూ భారీగా వెయిట్ తగ్గారు. సుమారు 20 కేజీలు తగ్గినట్టు తెలుస్తోంది. బరువు తగ్గడం ద్వారా తన పట్టుదల ఎలాంటిదో లోకేశ్ నిరూపించుకున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. అంతేగాక విమర్శకులకు గట్టిగా సమాధానమిచ్చినట్టేనని చెబుతున్నారు.