ప్రమాదంలో ప్రజాస్వామ్యం
ABN , First Publish Date - 2021-10-22T05:18:25+05:30 IST
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని టీడీపీ జాతీయ అఽధికార ప్రతినిధి, తూర్పు ఇనచార్జి మహ్మద్ నసీర్ తెలిపారు.
చంద్రబాబు దీక్షకు మద్దతుగా అర్ధనగ్న ప్రదర్శనలో నసీర్
గుంటూరు, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని టీడీపీ జాతీయ అఽధికార ప్రతినిధి, తూర్పు ఇనచార్జి మహ్మద్ నసీర్ తెలిపారు. టీడీడీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షకు మద్దతుగా టీడీపీ నాయకులు గురువారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా గుంటూరులోని గడ్డిపాడు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మాట్లాడుతూ ప్రశ్నించే ప్రతిపక్షాలను జగనరెడ్డి ఫ్యాక్షన రాజకీయాలతో భయపెట్టాలని చూస్తున్నారన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తి చంద్రబాబు కాదన్నారు. జగన అధికార మదంతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని, భావితరాలకు రాజకీయాలంటే విరక్తి పుట్టేంత రోత పట్టిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం బైక్ ర్యాలీగా పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి చంద్రబాబుకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఎల్లావుల అశోక్యాదవ్, గోళ్ల ప్రభాకర్, ఎస్ఎస్పీ జాదా, నారాయణపు శైలజ, వజ్రలక్ష్మి, జమీర్, సౌపాటి రత్నం, కనకారావు, బెళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.