గడువులో ఇక మూడు రోజులే మిగిలాయి: లోకేష్

ABN , First Publish Date - 2021-09-08T01:36:55+05:30 IST

విజయవాడ: దళిత బిడ్డ రమ్యని నడి రోడ్డుపై దారుణంగా హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష ఎప్పుడు వేస్తారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. నిందితుడికి శిక్ష విధించడంపై తాము ఇచ్చిన గడువులో ఇక

గడువులో ఇక మూడు రోజులే మిగిలాయి: లోకేష్

విజయవాడ: దళిత బిడ్డ రమ్యని నడి రోడ్డుపై దారుణంగా హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష ఎప్పుడు వేస్తారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. నిందితుడికి శిక్ష విధించడంపై తాము ఇచ్చిన గడువులో ఇక మూడు రోజులే మిగిలాయని ఆయన గుర్తు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దిశ చట్టం ద్వారా ముగ్గురికి ఉరి శిక్ష, 20 మందికి కఠిన జైలు శిక్ష పడిందంటూ మహిళలను.. హోంమంత్రి సుచరిత మోసం చేస్తున్నారని ఆరోపించారు.


దిశ చట్టంతో ఉరి శిక్ష పడ్డ వారి పేర్లు బయట పెట్టే దమ్ము జగన్ రెడ్డికి ఉందా.. అంటూ సవాల్ విసిరారు. దిశ చట్టానికి ప్రచారం పేరుతో సొంత మీడియాకి యాడ్స్ ఇచ్చుకొని రూ.30 కోట్లు కొట్టేశారన్నారు. అదే నిధులను పోలీసు వ్యవస్థ బలోపేతానికి వినియోగించి ఉంటే పరిస్థితి కొంతయినా మెరుగుపడేదని లోకేష్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-08T01:36:55+05:30 IST