‘గ్రామస్థాయి నుంచి టీడీపీ బలోపేతం కావాలి’

ABN , First Publish Date - 2022-01-28T06:32:33+05:30 IST

గ్రామస్థాయి నుంచి తెలుగు దేశం పార్టీ మరింత అభివృద్ధికి కార్యకర్తలంతా కష్టపడి పని చేయాలని ఆ పార్టీ గొలుగొండ మండల నూతన అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు పిలుపు నిచ్చారు.

‘గ్రామస్థాయి నుంచి టీడీపీ బలోపేతం కావాలి’
సమావేశంలో మాట్లాడుతున్న అడిగర్ల అప్పలనాయుడు

 గొలుగొండ, జనవరి 27 : గ్రామస్థాయి నుంచి తెలుగు దేశం పార్టీ మరింత అభివృద్ధికి కార్యకర్తలంతా కష్టపడి పని చేయాలని ఆ పార్టీ గొలుగొండ మండల  నూతన అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు పిలుపు నిచ్చారు. కొత్తమల్లంపేట చెరకు సేకరణ కేంద్రం వద్ద గురువారం కార్యకర్తల సమా వేశం ఏర్పాటైంది. ఈ సందర్భంగా అధ్య క్షుడిగా అడిగర్ల అప్పలనాయుడు, ఉపాధ్యక్షుడిగా కొల్లి గోవిందరావు, ప్రధాన కార్యదర్శిగా నాతిరెడ్డి అప్పలనాయుడు, ప్రధాన కార్య నిర్వాహక కార్యదర్శి గా బొడ్డు సత్యనారాయణతో పాటు తొమ్మిది మందిని సభ్యులుగా ఎన్నుకు న్నారు. అనంతరం అడిగర్ల మాట్లా డుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృ తంగా తీసుకువెళ్లాలన్నారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు చిటికెల తారకవేణుగోపాల్‌, నాయకులు కొల్లి సత్తిబాబు, రాంబాబు, సుర్ల బాబ్జీ, అదపురెడ్డి గోపాలకృష్ణ, చిటికెల సాంబమూర్తి, భీమిరెడ్డి సత్యనారాయణ, కామిరెడ్డి గోవింద్‌, నల్లబెల్లి నూకరాజు  పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T06:32:33+05:30 IST