AP టీడీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2021-08-15T17:23:57+05:30 IST

టీడీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

AP టీడీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ...ఎందరో మహానుభావులు పోరాటం చేస్తే మన దేశానికి స్వతంత్రాన్ని సాధించుకున్నామన్నారు. నేడు ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. స్వాతంత్ర ఫలాలు అందరికి చేరేలా చేసింది టీడీపీ మాత్రమే అని అన్నారు. 


అచ్చెన్నాయుడు మాట్లాడుతూ...75వ స్వాతంత్ర్య వేడుకలు జరువుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టి మరి వేధిస్తున్నారన్నారు. జగన్ పాలన కంటే బ్రిటిష్ పాలన బాగుండేది అని ఏపీ ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. టీడీపీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. 


Updated Date - 2021-08-15T17:23:57+05:30 IST