టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంగళగిరి పోలీసుల నోటీసులు
ABN , First Publish Date - 2021-10-23T19:33:27+05:30 IST
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కార్యాలయ ఉద్యోగి భద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వాలని పోలీసులు కోరారు. విచారణలో భాగంగా ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషనుకు వచ్చి వివరాలు అందివ్వాలని రిస్పెషన్ కమిటీ సభ్యుడు కుమార స్వామికి నోటీసులు జారీ చేశారు. పార్టీ కార్యాలయం గోడకు పోలీసులు నోటీసులు అంటించారు.