చేతికి సంకెళ్లు, నల్లకండువాలతో టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2020-12-03T14:29:01+05:30 IST

రాష్ట్రంలో వివిధ వర్గాలపై దాడులకు నిరసనగా అసెంబ్లీ వద్ద ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం ఉదయం నిరసనకు దిగారు.

చేతికి సంకెళ్లు, నల్లకండువాలతో టీడీపీ నిరసన

అమరావతి: రాష్ట్రంలో వివిధ వర్గాలపై దాడులకు నిరసనగా అసెంబ్లీ వద్ద ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం ఉదయం నిరసనకు దిగారు. అసెంబ్లీలోకి కొన్ని మీడియా సంస్థలను అనుమతించక పోవడంతో సంకెళ్లు, నల్ల కండువాలతో వినూత్నంగా ఆందోళన చేపట్టారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు.  టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి కాలి నడకన బయలుదేరివెళ్లారు. 

Updated Date - 2020-12-03T14:29:01+05:30 IST