‘తిరుపతి’లో వైసీపీ అక్రమాలు అడ్డుకోండి

ABN , First Publish Date - 2021-04-11T09:21:05+05:30 IST

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో అధికార వైసీపీ పాల్పడుతున్న అక్రమాలు, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలను నిలువరించాలని

‘తిరుపతి’లో వైసీపీ అక్రమాలు అడ్డుకోండి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ వినతి


అమరావతి,  ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో అధికార వైసీపీ పాల్పడుతున్న అక్రమాలు, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలను నిలువరించాలని కోరుతూ టీడీపీ ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్‌ను కోరింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ నేతృత్వంలో తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ ఎన్నికల అధికారిని కలిశారు. సత్యవేడు అసెంబ్లీ పరిధిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.. ఈ నెల 9న వలంటీర్లతో రహస్య సమావేశం నిర్వహించి ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలవాల్సిందిగా ఆదేశాలిచ్చారని ఫిర్యాదు చేశారు.   

Updated Date - 2021-04-11T09:21:05+05:30 IST