స్థానిక ఎన్నికల్లో పుంజుకున్న టీడీపీ
ABN , First Publish Date - 2021-11-18T23:56:39+05:30 IST
ఆంధ్రప్రదేశ్లో ఇవాళ వెలువడుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఇవాళ వెలువడుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ జెండా ఎగిరింది. వైసీపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల స్వగ్రామాల్లో సైతం టీడీపీ జెండా ఎగరడం గమనార్హం.
జిల్లాల వారిగా ఫలితాలు
విశాఖ జిల్లా ఆనందపురం జెడ్పీటీసీ వైసీపీ కైవసం
వైసీపీ అభ్యర్థి కోరాడ వెంకట్రావు 3,755 ఓట్ల మెజార్టీతో గెలుపు
తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలంలో ఎంపీటీసీ ఫలితాలు
6 స్థానాల్లో వైసీపీ, 4 స్థానాల్లో టీడీపీ, ఒక్కోచోట గెలిచిన సీపీఎం, సీపీఐ
విజయనగరం జిల్లాలో మొత్తం 9 ఎంపీటీసీ స్థానాలు
విజయనగరం జిల్లా (9 ఎంపీటీసీలు)- వైసీపీ: 6, టీడీపీ: 2, బీజేపీ: 1 స్థానంలో గెలుపు
శ్రీకాకుళం జిల్లాలో 15 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ 10, టీడీపీ 5 స్థానాల్లో గెలుపు
చిత్తూరు జిల్లాలో 8 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ 5, టీడీపీ 3 స్థానాల్లో విజయం
నెల్లూరు జిల్లాలో 4 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ 3, టీడీపీ 1 స్థానంలో గెలుపు
కడప జిల్లాలో 3 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ 3 స్థానాల్లో విజయం సాధించింది.
గుంటూరు జిల్లాలో 11 ఎంపీటీసీ స్థానాలు వైసీపీ: 9, టీడీపీ: 2
గుంటూరు జిల్లాలో ఒక జెడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం
పశ్చిమగోదావరి జిల్లాలో 14 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ: 10, టీడీపీ: 3, జనసేన: 1 చోట గెలిచింది.
ప.గో. జిల్లాలో ఒక జెడ్పీటీసీ స్థానం వైసీపీ కైవసం
తూర్పుగోదావరి జిల్లాలో 20 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ: 8 టీడీపీ: 6 జనసేన: 3 సీపీఐ(ఎం): 2 స్వతంత్రులు: 1 స్థానంలో గెలిచారు.
కృష్ణా జిల్లాలో 8 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ: 6 టీడీపీ: 2 స్థానాల్లో విజయం సాధించారు.
కృష్ణా జిల్లాలో 3 జెడ్పీటీసీ స్థానాలు
రెండు వైసీపీ, ఒక స్థానంలో టీడీపీ గెలిచింది.
కర్నూలు జిల్లాలో 7 ఎంపీటీసీ స్థానాలు
7 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు.
కర్నూలు జిల్లాలో ఒక జెడ్పీటీసీ స్థానం వైసీపీ కైవసం
అనంతపురం జిల్లాలో 16 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ: 10, టీడీపీ: 6 చోట్ల గెలిచారు.