టీడీపీ సీనియర్ నేత కన్నుమూత
ABN , First Publish Date - 2021-05-11T14:54:40+05:30 IST
బేతంచర్లలో టీడీపీ సీనియర్ నాయకుడు పోలూరు భాస్కర్ రెడ్డి(69) కన్నుమూశారు.
కర్నూలు: బేతంచర్లలో టీడీపీ సీనియర్ నాయకుడు పోలూరు భాస్కర్ రెడ్డి(69) కన్నుమూశారు. గత కొద్దికాలంగా బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. పార్టీ అధినేత చంద్రబాబుకు భాస్కర్ రెడ్డి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. భాస్కర్రెడ్డి మృతిపట్ల పలువురు జిల్లా టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు.