టీడీపీ సీనియర్‌ నాయకుడు ఆకస్మిక మృతి

ABN , First Publish Date - 2021-01-08T17:16:36+05:30 IST

టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేసిన ఆయన

టీడీపీ సీనియర్‌ నాయకుడు ఆకస్మిక మృతి

హైదరాబాద్ : ఖైరతాబాద్‌కు చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు అయూబ్‌ ఖాన్‌(48) ఆకస్మికంగా మృతి చెందాడు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేసిన ఆయన హైదరాబాద్‌ మైనారిటీ విభాగం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం డివిజన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. గురువారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స చేస్తుండగానే మృతి చెందాడు. కార్పొరేటర్‌ విజయారెడ్డి, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ సీనియర్‌ నేతలు అయూబ్‌ఖాన్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. 


Updated Date - 2021-01-08T17:16:36+05:30 IST