గుండెపాటుతో టీడీపీ సీనియర్‌ నాయకుడు మృతి

ABN , First Publish Date - 2022-01-20T04:53:40+05:30 IST

టీడీపీ మండల అఽధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పనిచేసి పార్టీ కార్యకర్తలు, నాయకుల మన్ననలు పొందిన మక్కే నారాయణ(65) మంగళవారం రాత్రి గుండెపోటుతో చెందాడు. అప్పటి వరకు స్వగ్రామం కరేడులో ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని యువతను ఉత్సాహపరుస్తూ దగ్గరుండి జరిపించారు. రాత్రి ఇంటికెళ్లిన కొద్ది సేపటికే ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో హుటాహుటిన సింగరాయకొండ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి ఒంగోలుకు తీసుకెళుతుండగా మార్గమధ్యలో చనిపోయాడని బంధువులు తెలిపారు.

గుండెపాటుతో టీడీపీ సీనియర్‌ నాయకుడు మృతి
టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు మక్కే నారాయణ(ఫైల్‌ ఫొటో)

కరేడు(ఉలవపాడు), జనవరి 19 : టీడీపీ మండల అఽధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పనిచేసి పార్టీ కార్యకర్తలు, నాయకుల మన్ననలు పొందిన మక్కే నారాయణ(65) మంగళవారం రాత్రి గుండెపోటుతో చెందాడు. అప్పటి వరకు స్వగ్రామం కరేడులో ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని యువతను ఉత్సాహపరుస్తూ దగ్గరుండి జరిపించారు. రాత్రి ఇంటికెళ్లిన కొద్ది సేపటికే ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో హుటాహుటిన సింగరాయకొండ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి ఒంగోలుకు తీసుకెళుతుండగా మార్గమధ్యలో చనిపోయాడని బంధువులు తెలిపారు. అంత్యక్రియల కోసం నెల్లూరు జిల్లా కావలిలోని సొంత ఇంటికి తరలించి బుధవారం అంత్యక్రియలు చేశారు. ఆర్టీసీ కండక్టర్‌గా రిటైర్డ్‌ అయిన ఆయన 2014 నుంచి మండల టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. కందుకూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దివి శివరాం, ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజి, నెల్లూరు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్‌, టీడీపీ నాయకులు ఇంటూరి నాగేశ్వరరావు నారాయణ మృతదేహాన్ని సందరిర్శంచి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుంటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉలవపాడు, గుడ్లూరు మండలలాల నుంచి పలువురు టీపీపీ నాయకులు, కార్యకర్తలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-20T04:53:40+05:30 IST