టీడీపీ సీనియర్ నేత కన్నుమూత

ABN , First Publish Date - 2021-06-21T18:06:43+05:30 IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, రాష్ట్రస్థాయి సీనియర్‌ నాయకుడు...

టీడీపీ సీనియర్ నేత కన్నుమూత

హైదరాబాద్ సిటీ/రామంతాపూర్‌ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, రాష్ట్రస్థాయి సీనియర్‌ నాయకుడు లింగాల దశరథ్‌గౌడ్‌ కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. దశరథ్‌గౌడ్‌ మృతదేహాన్ని టీటీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రొఫెసర్‌ జ్యోత్స్న, మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కందికంటి అశోక్‌కుమార్‌గౌడ్‌, నాయకులు సర్వ సత్తయ్య యాదవ్‌, సుర్వీ భిక్షపతి, మోహబూబ్‌, ఎజాజ్‌, బీజేపీ డివిజన్‌ అధ్యక్షుడు బండారు వెంకట్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు మేకల మధుసూదన్‌రెడ్డి, శాగ రవి, బాబు యాదవ్‌ తదితర ప్రముఖులు సందర్శించి, నివాళులర్పించారు.



Updated Date - 2021-06-21T18:06:43+05:30 IST