ముఖ్యమంత్రి గారూ!.. ఆ మాటే నిజం చేశారుగా?: వర్ల

ABN , First Publish Date - 2020-07-02T17:20:06+05:30 IST

వైసీపీలో పని విభజన చేస్తూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను ప్రధానమైన ముగ్గురి వ్యక్తులకు బాధ్యతలు కట్టబెడుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై

ముఖ్యమంత్రి గారూ!.. ఆ మాటే నిజం చేశారుగా?: వర్ల

అమరావతి: వైసీపీలో పని విభజన చేస్తూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను ప్రధానమైన ముగ్గురి వ్యక్తులకు బాధ్యతలు కట్టబెడుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ముఖ్యమంత్రి గారూ! రాష్ట్ర ప్రజలు అనుకుంటున్న మాటే నిజం చేశారుగా? రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి మనవాళ్లు ముగ్గురికి కట్ట పెట్టారుగా?, ముఖ్యమైన పనులు మావాళ్లే చేస్తారు అన్నట్లుగా వుంది మీ పనితీరు. ఇతరులను అవమానం పాలు చేస్తున్నట్లు కాదా?, ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేసినట్లు లేదా? ఎలా?.’’ అంటూ వర్ల ట్వీట్ చేశారు.



Updated Date - 2020-07-02T17:20:06+05:30 IST