టీడీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

ABN , First Publish Date - 2021-01-26T06:11:08+05:30 IST

టీడీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పిలుపునిచ్చారు.

టీడీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే

ఎమ్మెల్సీ బుద్ద, మాజీ ఎమ్మెల్యే పీలా


అనకాపల్లి, జనవరి 25: టీడీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పిలుపునిచ్చారు. గవరపాలెంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు తీర్పుతో గుణపాఠం వచ్చిందన్నారు. రాజ్యాంగ వ్యవస్థను గౌరవించాల్సిన ఆవశ్యకతను కోర్టు సుస్పష్టంగా చెప్పిందన్నారు. కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహిస్తేనే తమకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచిందన్నారు. 2013 స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ అధిక స్థానాల్లో గెలిచిందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు పార్టీ శ్రేణులు పనిచేయాలని కోరారు. అధికార పార్టీ వారు ఎటువంటి దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడినా ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేయాలని వారు సూచించారు. సమావేశంలో నాయకులు నడిపల్లి గణేశ్‌, మళ్ల సురేంద్ర, ధనాల విష్ణుచౌదరి, మళ్ల శ్రీరాములు, కర్రి నాయుడు, నూకునాయుడు, దొడ్డి సూరిబాబు, కోటేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-26T06:11:08+05:30 IST