టీడీపీ ఎస్‌.కోట మహిళా కమిటీ ఎన్నిక ఏకగ్రీవం

ABN , First Publish Date - 2020-12-01T05:07:11+05:30 IST

విశాఖ పార్లమెంటు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో ఎల్‌.కోటలో సోమవారం తెలుగుదేశం పార్టీ ఎస్‌.కోట నియోజకవర్గ మహిళా కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది.

టీడీపీ ఎస్‌.కోట మహిళా కమిటీ ఎన్నిక ఏకగ్రీవం

కొత్తవలస రూరల్‌(ఎల్‌.కోట), నవంబరు30: విశాఖ పార్లమెంటు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో ఎల్‌.కోటలో సోమవారం తెలుగుదేశం పార్టీ ఎస్‌.కోట నియోజకవర్గ మహిళా కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. అధ్యక్షురాలిగా జి.భారతి, ప్రధానకార్యదర్శిగా బి.సత్యలక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా దాసరి లక్ష్మి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులుగా నిమ్మకాయల సంతోషి, కరెడ్ల కనకమహాలక్ష్మి, కార్యదర్శులుగా వి.ప్రభ, గనివాడ లక్ష్మి, గొంప తులసి, సభ్యులుగా వి.సన్యాసమ్మ తదితరులు ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సర్వసిద్ధి అనంతలక్ష్మి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 

పార్లమెంటరీ నియోజకవర్గ ఆర్గనైజింగ్‌ కార్యదర్శులుగా జామి మహిళలు

శృంగవరపుకోట రూరల్‌(జామి): జామి మండలానికి చెందిన ఇద్దరు మహిళ మాజీ  సర్పంచులకు టీడీపీ అధిష్ఠానం కొత్త పదవులు ఇచ్చింది. సోమవారం టీడీపీ విశాఖపార్లమెంటరీ మహిళ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సమక్షంలో  జరిగిన కార్యక్రమంలో జామి మాజీ సర్పంచ్‌ ఇప్పాక వెంకటత్రివేణి, రామయ్యపాలెం మాజీ సర్పంచ్‌ మాకిరెడ్డి శ్రీలక్ష్మికి విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ ఆర్గనైజింగ్‌ కార్యదర్శులుగా ఎంపికచేశారు. వీరికి ఈ పద వులు లభించడంపై మండల టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-12-01T05:07:11+05:30 IST