టీడీపీ రాష్ట్ర కమిటీలో జిల్లా నేతలకు పదవులు
ABN , First Publish Date - 2021-10-17T06:02:38+05:30 IST
టీడీపీ రాష్ట్ర కమిటీలో జిల్లా నేతలకు పదవులు
విజయవాడ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): టీడీపీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ఐదుగురికి పదవులు లభించాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పి.అశోక్బాబు, మచిలీపట్నం నుంచి కొనకళ్ల బుల్లయ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి చెన్నుపాటి గాంధీ, పశ్చిమ నియోజకవర్గం నుంచి సాదరబోయిన ఏడుకొండలు, పెందుర్తి శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శులుగా నియమితులయ్యారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.