ఆయనకు అంత స్థాయి లేదు: నాదెండ్ల బ్రహ్మం

ABN , First Publish Date - 2021-09-08T02:07:46+05:30 IST

విజయవాడ: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి లోకేష్‌ను విమర్శించే స్థాయి.. దేవినేని అవినేష్‌కు లేదని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ నాదెండ్ల బ్రహ్మం పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. లోకేష్ గురించి

ఆయనకు అంత స్థాయి లేదు: నాదెండ్ల బ్రహ్మం

విజయవాడ: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి లోకేష్‌ను విమర్శించే స్థాయి.. దేవినేని అవినేష్‌కు లేదని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ నాదెండ్ల బ్రహ్మం పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. లోకేష్ గురించి దేవినేని అవినాష్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గుడివాడ రాజకీయం చూసుకోమంటూ అవినాష్‌కి టీడీపీ బాధ్యతలు అప్పగిస్తే.. పారిపోయి వైసీపీలో చేరారని విమర్శించారు. తన స్థాయి తక్కువని తానే ఒప్పుకొని వైసీపీలో చేరారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ గానీ, దేవినేని అవినాష్ గానీ తప్పులు లేకుండా,  ఆపకుండా శుక్లాం..బరధరం.. శ్లోకాన్ని చదివితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.


జగన్‌కి హిందూ మతం అన్నా, హిందూ దేవుళ్లన్నా భయమని చెప్పారు. తన మత వ్యాప్తి కోసమే జగన్ తాపత్రయ పడుతున్నారని ఆరోపించారు. వినాయక చవితి వేడుకలను కావాలనే అడ్డుకుంటూ, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. చవితి పండుగ హిందువుల పండుగ మాత్రమే కాదని.. ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉత్సవాల్లో  ఏదో ఒక కళారూపాల్ని ప్రదర్శించుకుంటూ ఉపాధి పొందుతారని గుర్తుచేశారు. వినాయకచవితి వేడుకలకు కొవిడ్ నిబంధనలతో కూడిన అనుమతులను వెంటనే జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-09-08T02:07:46+05:30 IST