ముఖ్యమంత్రి మాట నిలుపుకోవాలి

ABN , First Publish Date - 2021-07-30T05:18:22+05:30 IST

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు. సీపీఎస్‌కు వ్యతిరేకంగా నెల్లూరు ఆర్డీవో కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో గురువారం కోటంరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు.

ముఖ్యమంత్రి మాట నిలుపుకోవాలి
ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న కోటంరెడ్డి

టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి 

నెల్లూరు (వెంకటేశ్వరపురం), జూలై 29 : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు. సీపీఎస్‌కు వ్యతిరేకంగా నెల్లూరు ఆర్డీవో కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో గురువారం కోటంరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం మట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులను మోసం చేసిన జగన్‌కు రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-30T05:18:22+05:30 IST