జంగారెడ్డిగూడెంలో టీడీపీ విజయం ఖాయం
ABN , First Publish Date - 2021-03-01T05:16:57+05:30 IST
జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీపై తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమని ఽఏలూరు పార్లమెంట్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు దీమా వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే గన్ని
చైర్పర్సన్ అభ్యర్థిగా రమాదేవి నామినేషన్
జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 28 :జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీపై తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమని ఽఏలూరు పార్లమెంట్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు దీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ వేసి మృతిచెందిన అభ్యర్థుల స్థానంలో అదే పార్టీకి చెందిన మరొకరు నామినేషన్ వేసే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించడంతో జంగారెడ్డిగూడెం మున్సిపల్ పరిధిలోని 29 వార్డుల్లో 5వ వార్డుకు టీడీపీ తరపున నామినేషన్ వేసిన దూబే దేవానందప్రసాద్ అనారోగ్యంతో గతంలో మృతి చెందారు. దీంతో పట్టణానికి చెందిన కరుటూరి రమాదేవి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా తన ఇంటివద్ద నుంచి కార్యకర్తలు, నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అభ్యర్థి రమాదేవి మాట్లాడుతూ పట్టణంలోని రోడ్లు, డ్రెయినేజీ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శులు దాసరి శ్యామ్చంద్రశేషు, జయవరపు శ్రీరామ్మూర్తి, నియోజకవర్గ ఇన్చార్జి దొరబాబు, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, షేక్ ముస్తఫా, పెనుమర్తి రామ్కు మార్, పరిమి సత్తిపండు, చెరుకూరి శ్రీధర్, సీహెచ్ రామలింగేశ్వరరావు, పాల్గొన్నారు.