ప్రకాశం జిల్లాలో టీడీపీ-వైసీపీ వర్గాలు పరస్పరం దాడి

ABN , First Publish Date - 2021-06-24T15:24:54+05:30 IST

ఏపీలో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య పరస్పరం దాడులు పెరుగుతున్నాయి. వారం క్రితం కర్నూలు జిల్లాలో వైసీపీ-టీడీపీ మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన మరుక ముందే మరో

ప్రకాశం జిల్లాలో టీడీపీ-వైసీపీ వర్గాలు పరస్పరం దాడి

ప్రకాశం: ఏపీలో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య పరస్పరం దాడులు పెరుగుతున్నాయి. వారం క్రితం కర్నూలు జిల్లాలో వైసీపీ-టీడీపీ మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన మరుక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాలో టీడీపీ-వైసీపీ వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. సంతమాగులూరు మండలం కామేపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలు, ఇనుప రాడ్లతో టీడీపీ, వైసీపీ వర్గాలు దాడికి దిగాయి. అయితే..ఈ ఘర్షణలో టీడీపీ వర్గీయుడు లక్కిపోగు సుబ్బారావు మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. దాడిలో గాయపడిన వారి దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-06-24T15:24:54+05:30 IST