కరోనాతో టీడీపీ మహిళా నేత కన్నుమూత
ABN , First Publish Date - 2021-06-12T17:57:11+05:30 IST
కరోనాతో టీడీపీ మహిళా నేత మృతి చెందారు.
హైదరాబాద్ సిటీ/బేగంపేట : కరోనాతో టీడీపీ మహిళా నేత మృతి చెందారు. బల్కంపేటకు చెందిన సుష్మ అలియాస్ లక్ష్మీకాంతం కుమార్తె వివాహం మే 6వ తేదీన చిత్తూరు జిల్లా, కాణిపాకం సమీపంలోగల గ్రామంలో జరిగింది. వివాహం అనంతరం సుష్మ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. మే 10వ తేదీన నగరానికి వచ్చి ప్రకృతి చికిత్సాలయంలో కొవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. కొద్దిరోజులు ఇంట్లోనే ఐసొలేషన్లో ఉండి మందులు వాడారు. ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతోపాటు బ్రీతింగ్ సమస్య ఏర్పడడంతో మే 17వ తేదీన ఓ ఆస్పత్రిలో సిటీస్కాన్ చేయించుకున్నారు. ఊపిరితిత్తుల్లో 16-25 శాతం ఇన్ఫెక్షన్ ఉందని తేలడంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.
చికిత్స పొందుతున్న ఆమెకు పలుమార్లు సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో ఐసీయూలో ఉంచి వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఈనెల 10న పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున సుష్మ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం సనత్నగర్లోని ఈఎ్సఐ శ్మశాన వాటికలో కొవిడ్ నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె మృతి పట్ల అమీర్పేట, సనత్నగర్, బల్కంపేట ప్రాంతానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నేతలు సంతాపం తెలిపారు. టీఆర్ఎస్ నేత కూన వెంకటేష్గౌడ్ సుష్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.