ఉచిత ఇసుక విధానం అమలు చేయాలి: జవహర్
ABN , First Publish Date - 2021-06-17T21:48:49+05:30 IST
ఉచిత ఇసుక విధానం అమలు చేయాలి: జవహర్
పశ్చిమగోదావరి: ఇసుక విధానంలో ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరతీసిందని మాజీ మంత్రి జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఇసుక ధరను ఆరు రెట్లు పెంచి కృత్రిమ కొరత సృష్టించిందన్నారు. గతంలో లారీ కిరాయితో ఇసుక ధర రూ. 6 వేలు ఉంటే.. ఇప్పుడు రూ.20 వేల వరకు అమ్ముతూ ప్రజలను దోచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలకు నెలకు రూ.400 కోట్ల ముడుపులు అందుతున్నాయన్నారు. వైసీపీ సర్కార్ ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.