సంతకం దొరికింది కదా అని స్కామ్ కోసం వెతుకుతోంది: టీడీపీ
ABN , First Publish Date - 2020-09-22T22:18:25+05:30 IST
సంతకం దొరికింది కదా అని స్కామ్ కోసం వెతుకుతోంది: టీడీపీ
అమరావతి: ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అప్పటి సీఎం చంద్రబాబు వద్ద ఉంది..లోకేష్ సంతకం చేశారంటూ తప్పుడు ప్రచారం ఆపాలని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఫైబర్ నెట్, భారత్ నెట్కు తేడా తెలియకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భారత్ నెట్కు సంబందించి వివిధ రాష్ట్రాలతో కేంద్రం ఒప్పందం చేసుకుందన్నారు. ఈ ఒప్పందం కోసం ఢిల్లీ వెళ్ళే ఐటీ అధికారులకు ఐటీ మంత్రిగా అనుమతి ఇస్తూ లోకేష్ సంతకం చేశారని పేర్కొన్నారు. జగన్ టీమ్ సంతకం దొరికింది కదా అని స్కామ్ కోసం వెతుకుతోందన్నారు.