వైసీపీ లాగా టీడీపీ గాలికొచ్చిన పార్టీ కాదు: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-01-27T21:02:25+05:30 IST

పిరికితనం అనేది తెలియని పార్టీ టీడీపీ అని, భయం అనేది మన ఇంటావంటా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ శ్రేణులతో అన్నారు.

వైసీపీ లాగా టీడీపీ గాలికొచ్చిన పార్టీ కాదు: చంద్రబాబు

అమరావతి: పిరికితనం అనేది తెలియని పార్టీ టీడీపీ అని, భయం అనేది మన ఇంటావంటా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ శ్రేణులతో అన్నారు. టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పంచాయితీ ఎన్నికలను ప్రతి టీడీపీ కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. వైసీపీ లాగా టీడీపీ గాలికొచ్చిన పార్టీ కాదని తెలిపారు. నాలుగు దశాబ్దాల చరిత్ర.. 22 ఏళ్లు అధికారంలో టీడీపీ ఉందని గుర్తుచేశారు. జగన్ సీఎం అయ్యాక అధికార యంత్రాంగం నీరు గారిపోయిందని, రాజ్యాంగ ఉల్లంఘనలకు కూడా తెగించారని చంద్రబాబు మండిపడ్డారు. అధికారుల్లో కొందరు వెన్నెముక లేని వ్యక్తులుగా తయారయ్యారని ఆరోపించారు. గ్రామాల్లో యధేచ్చగా దోపిడి చేసేందుకే ఏకగ్రీవాల జపం వైసీపీ చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు నిలిపేయాలని, ప్రభుత్వ మద్యం దుకాణాలను, లిక్కర్ షాపులను మూసివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-01-27T21:02:25+05:30 IST