అందుకే ఇతర రాష్ట్రాలకి పరుగులు తీస్తున్నారు: టీడీపీ నేత

ABN , First Publish Date - 2020-07-23T16:48:19+05:30 IST

అందుకే ఇతర రాష్ట్రాలకి పరుగులు తీస్తున్నారు: టీడీపీ నేత

అందుకే ఇతర రాష్ట్రాలకి పరుగులు తీస్తున్నారు: టీడీపీ నేత

నెల్లూరు: కరోనా పెద్ద ఎత్తున విజృంభించడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మండిపడ్డారు. సీఎం జగన్ చాలా తేలికగా మాట్లాడారని చెప్పారు. వైసీపీ నేతలు కరోనా వాహకులుగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం లేక ఇతర రాష్ట్రాలకి పరుగులు తీస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి పదివేలు ఆర్ధిక సాయం అందివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మృతి చెందిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలకి రూ.50 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలన్నారు. 

Updated Date - 2020-07-23T16:48:19+05:30 IST