ఉద్యోగాల పేరుతో టోకరా వేసిన ఉపాధ్యాయుడి అరెస్టు
ABN , First Publish Date - 2020-05-28T08:58:16+05:30 IST
జిల్లాపరిషత్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి పరారైన ఉపాద్యాయుడు మల్లి
అనంతపురం క్రైం, మే27 : జిల్లాపరిషత్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి పరారైన ఉపాద్యాయుడు మల్లి కార్జునను అనంతపురం రూరల్ పోలీసులు అరెస్టు చేశా రు. సుమారు రూ. 15 లక్షల వరకూ నిరుద్యోగులకు టోకరా వేసినట్లు పోలీ సు విచారణలో వెల్లడైంది. ఉపా ధ్యాయుడితో పాటు అతడికి సహకరించిన మరి కొందరిని విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతానికి ఉపాధ్యా యుడిపై కేసు నమోదు చేసి కోర్టు ఆదేశాల మేరకు బుధ వారం రిమాం డుకు తరలించారు.