కరోనాతో టీచర్‌ మృతి

ABN , First Publish Date - 2021-05-14T04:48:00+05:30 IST

కరోనాతో ఉపాధ్యాయురాలు మృతి చెందిన ఘటన పెద్దపంజాణి మండలంలో గురువారం చోటుచేసుకుంది.

కరోనాతో టీచర్‌ మృతి
నాగమణి

పెద్దపంజాణి, మే 13 : కరోనాతో ఉపాధ్యాయురాలు మృతి చెందిన ఘటన పెద్దపంజాణి మండలంలో గురువారం చోటుచేసుకుంది. చళమంగలంలో నివాసం ఉంటున్న నాగమణి(51) పలమనేరు బాలికోన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వారం రోజులక్రితం ఈమె భర్త ప్రకాష్‌(58) కరోనాతో  మృతిచెందాడు. భర్త మృతితో నాగమణి కరోనా పరీక్ష చేయించుకుంది. ఆమెకు పాజిటివ్‌ రావడంతో వేలూరు సీఎంసీలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. వారం వ్యవధిలో తల్లి, తండ్రి ఇరువురు మృతిచెందడంతో ఆపిల్లలు అనాథలుగా మారారు. ఇదే కుటుంబం పౌరోహిత్యం కూడా నిర్వహిస్తుండడంతో ఆ గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. నాగమణి మృతికి పెద్దపంజాణి, పలమనేరు ఎంఈవోలు సంతాపాన్ని ప్రకటించారు.

Updated Date - 2021-05-14T04:48:00+05:30 IST