రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయిని మృతి

ABN , First Publish Date - 2021-10-20T05:13:27+05:30 IST

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయిని మృతిచెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయిని మృతి

 గుమ్మలక్ష్మీపురం, అక్టోబరు 19: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయిని మృతిచెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఇరిడి గ్రామానికి చెందిన నిమ్మక గీత (45) జియ్యమ్మవలస మండలం టీకేజమ్ము ఆశ్రమ పాఠశాలలో సోషల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈమె మంగళ వారం ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని కొదుకుప జలపాతాన్ని చూసేందుకు స్కూటీ పై వెళ్లారు. తిరిగి వస్తుండగా పైగువ గ్రామ సమీపంలో ఈమె మెడలో వేసుకున్న చున్నీ స్కూటీ చక్రానికి చుట్టుకుపోయింది. దీంతో స్కూటీ బోల్తా పడడంతో ఈమె తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందారు. ఎల్విన్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈమె మృతిపై ఉపాధ్యాయ సంఘాలు, గిరిజన సంఘాలు, ప్రజాప్రతినిధులు సంతాపాన్ని ప్రకటించారు.

 

Updated Date - 2021-10-20T05:13:27+05:30 IST