కొవిడ్తో ఉపాధ్యాయురాలి మృతి
ABN , First Publish Date - 2021-05-17T06:11:08+05:30 IST
కొవిడ్ బారినపడి శ్రీకాళహస్తికి చెందిన ఉపాధ్యాయురాలు శ్రీలత ఆదివారం మృతిచెందారు.
శ్రీకాళహస్తి, మే 16: కొవిడ్ బారినపడి శ్రీకాళహస్తికి చెందిన ఓ ఉపాధ్యాయురాలు మృతిచెందారు. వివరాలివీ.. పట్టణ కొత్తపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల తెలుగు పండిట్గా శ్రీలత(53) పనిచేస్తున్నారు. తిరుపతిలో నివాసముంటున్న ఆమెకు ఇటీవల కరోనా సోకింది. అప్పటి నుంచి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీలత ఆదివారం మృతిచెందారు. ఆమె మృతి పట్ల పలువురు ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.