వీలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-07-30T04:37:28+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏపీటీ ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.
తాడేపల్లిగూడెం రూరల్, జూలై 29: రాష్ట్ర ప్రభుత్వం 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏపీటీ ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం తాలూకా కార్యాలయ కూడలి వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏపీటీఎఫ్ పట్టణ అధ్యక్షుడు ఎల్ రాజు, జోన్ కన్వీనర్ బీవీ నారాయణ, జిల్లా ఉపాధ్యక్షురాలు ఝాన్సీ , రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు పార్వతీదేవి పాల్గొన్నారు.
తణుకు: విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం ఏపీటీఎఫ్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించింది. జాతీయ విద్యావిధానం పేరుతో 3,4,5 తరగతులను ఉన్నత స్కూల్స్లో విలీనం చేసి ప్రాధమిక పాఠశాలను నిర్వీర్యం చేయరాదని, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, బకాయి పడిన ఆరు విడతల కరువు భత్యం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి ఐ.రాజగోపాల్, పీఎన్వీ ప్రసాదరావు, కె.రామప్రసాద్, జనార్దన స్వామి, నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దారు ప్రసాద్కు వినతి పత్రం అందించారు.