టీచర్ల డిప్యుటేషన్లు రద్దు
ABN , First Publish Date - 2021-12-01T05:34:57+05:30 IST
ఎట్టకేలకు నగరపాలక సంస్థ ఉపాధ్యాయుల డిప్యుటేషన్లు రద్దు చేసి యథాస్థానాలకు, అ వసరమైన పాఠశాలలకు సర్దుబాటు చేయాలని నగర కమిషనర్ పీవీవీఎస్ మూర్తి ఆదేశించారు.
పాత స్థానాలు, సర్దుబాటుకు కమిషనర్ ఆదేశం
టీచర్ల గొడవతో నిలిచిన జాబితా తయారీ
అనంతపురం కార్పొరేషన, నవంబరు 30: ఎట్టకేలకు నగరపాలక సంస్థ ఉపాధ్యాయుల డిప్యుటేషన్లు రద్దు చేసి యథాస్థానాలకు, అ వసరమైన పాఠశాలలకు సర్దుబాటు చేయాలని నగర కమిషనర్ పీవీవీఎస్ మూర్తి ఆదేశించారు. మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్ర చురితమైన ‘ధిక్కారమేనా?’ కథనానికి నగర కమిషనర్ స్పందించి ఈ ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే మూడేళ్ల క్రితం అమలు చేసిన డిప్యుటేషనను రద్దు చేయాలని సెక్రటరీ సంగం శ్రీనివాసులు, యూఎల్బీ కో-ఆర్డినేటర్ రమే్షలకు సూచించారు. సెక్రటరీ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి తన చాంబర్ లో సర్దుబాటుకు సంబంధించి జాబితా త యారు చేసేందుకు శ్రీకారం చుట్టారు. అదే సమయంలోనే సమాచారం అందుకున్న ఉ పాధ్యాయులు, సంఘాల నాయకులు ఒక్కొక్కరు ఆయన చాంబర్కు రావడం మొదలుపెట్టారు. జాబితా తయారు చేసే సమయం లో ఓ ఉపాధ్యాయుడిని ఎలా పెట్టుకున్నారని పలువురు నిలదీశారు. దీనికితోడు సం ఘాల నాయకులు, పలువురు ఉపాధ్యాయు లు సర్దుబాటుపై గొడవకు దిగారు. దీంతో కో-ఆర్డినేటర్ రమేష్ అసంతృప్తి వ్యక్తం చే స్తూ బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది. అనంతరం సెక్రటరీ శ్రీనివాసులు సంఘం నాయకులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. అందరూ ఒక నిర్ణయానికి రావాలనీ, నిబంధనల మేరకు బుధవారం జాబితా సిద్ధం చే స్తామని స్పష్టం చేశారు.