టోల్‌ప్లాజా వద్ద ఉపాధ్యాయుల ధర్నా

ABN , First Publish Date - 2022-01-21T04:00:15+05:30 IST

నెల్లూరు కలెక్టరేట్‌కు ధర్నాకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సూళ్లూరుపేటకు చెందిన పలువురు ఉపాధ్యాయులు స్థానిక స్వర్ణటోల్‌ప్లాజా వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.

టోల్‌ప్లాజా వద్ద ఉపాధ్యాయుల ధర్నా
టోల్‌ప్లాజా వద్ద ఉపాధ్యాయుల ధర్నా

సూళ్లూరుపేట, జనవరి 20 :  నెల్లూరు కలెక్టరేట్‌కు ధర్నాకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సూళ్లూరుపేటకు చెందిన పలువురు ఉపాధ్యాయులు స్థానిక స్వర్ణటోల్‌ప్లాజా వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తాము శాంతియుతంగా జరిగే ధర్నాకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం మంచిపద్ధతి కాదని విమర్శించారు. పలువురు ఉపాధ్యాయులు ఇతర మార్గాల్లో నెల్లూరుకు చేరి ధర్నాలో పాల్గొనడం విశేషం. 

ఉపాధ్యాయుల అరెస్టుకు నిరసన

నెల్లూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నాకు వెళ్తున్న ఉపాధ్యాయులను ఈ ప్రభుత్వం పోలీసులచే అరెస్టు చేయించడాన్ని  ఖండిస్తూ వామపక్ష విద్యార్థిసంఘాల నేతలు స్థానిక ఎంఈవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రంలో భావస్వేచ్ఛ లేకుండా పోయిందని  ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి ఇలపా నాగేంద్రబాబు అన్నారు. వామపక్ష విద్యార్థిసంఘాల నేతలు సూర్య, లోకేష్‌, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T04:00:15+05:30 IST