ఎలక్ర్టానిక్ మీడియా ద్వారా ప్రచారం నిషేధం
ABN , First Publish Date - 2021-03-03T05:52:23+05:30 IST
ఉభయగోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందు అంటే ఈనెల 12 సాయంత్రం నుంచి, పోలింగ్ జరిగే 14వ తేదీ సాయంత్రం వరకు ఎలక్ర్టానిక్ మీడియాలో అభ్యర్థుల ప్రచారం నిషేధమని కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి తెలిపారు
కాకినాడ, మార్చి2 (ఆంధ్రజ్యోతి): ఉభయగోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందు అంటే ఈనెల 12 సాయంత్రం నుంచి, పోలింగ్ జరిగే 14వ తేదీ సాయంత్రం వరకు ఎలక్ర్టానిక్ మీడియాలో అభ్యర్థుల ప్రచారం నిషేధమని కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి తెలిపారు. నిబంధన ఉల్లంఘించిన వారిపై ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 126ఏ ,సబ్ సెక్షన్ (1) కింద జరిమానా లేదా రెండేళ్ల జైలు శిక్ష లేదా రెండూ విధిస్తారని స్పష్టం చేశారు. 14న పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఈ నెల 12 సాయంత్రం 6 గంటల నుంచి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు, అలాగే 17వ తేదీన కౌంటింగ్ ముగిసే వరకు జిల్లా వ్యాప్తంగా లిక్కర్ షాపులు, బార్లు, క్లబ్బులు, మిలటరీ క్యాంటీన్లు, కల్లు దుకాణాలు మూసి వేయిస్తామన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆబ్కారీ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.