పీఆర్సీకి వ్యతిరేకంగా ఉపాధ్యాయుల నిరసన

ABN , First Publish Date - 2022-01-20T04:51:54+05:30 IST

పీఆర్సీకి వ్యతిరేకంగా వలేటివారిపాలెంలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పీఆర్సీ జీవో ప్రతులను దహనం చేశారు. మోసపూరిత పీఆర్‌సీకి వ్యతిరేకంగా ఫ్యాప్టో, బీటీఏ ఆధ్వర్యంలో గురువారం జరగనున్న కలెక్టరెట్‌ ముట్టడిలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

పీఆర్సీకి వ్యతిరేకంగా ఉపాధ్యాయుల నిరసన
వలేటివారిపాలెంలో పీఆర్సీ జీవో ప్రతులను తగులబెడుతున్న ఉపాద్యాయ సంఘాలు

వలేటివారిపాలెం, జనవరి 19 : పీఆర్సీకి వ్యతిరేకంగా  వలేటివారిపాలెంలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పీఆర్సీ జీవో ప్రతులను దహనం చేశారు. మోసపూరిత పీఆర్‌సీకి వ్యతిరేకంగా ఫ్యాప్టో, బీటీఏ ఆధ్వర్యంలో గురువారం జరగనున్న కలెక్టరెట్‌ ముట్టడిలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు కమల్‌కుమార్‌, కట్టా రమేష్‌, ఏ.వీ రావు, యాదన్నబోయిన అశోక్‌, నాగులపాటి శ్రీనివాసరావు, కోటకొండ శ్యామ్‌, దార్ల ఆదినారాయణ, కూచిపూడి డేవిడ్‌, చదలవాడ శ్యాంప్రసాద్‌, దామోదర్‌, వై.వి బ్రహ్మయ్య, కే. శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు,  విష్ణువర్దన్‌, శైలజ, సౌజన్య, బీటీఏ నాయకులు కే. మోహన్‌రావు తదితర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-01-20T04:51:54+05:30 IST