ఇందిరా పార్కు వద్ద.. ఫిబ్రవరి 12న ఉపాధ్యాయుల ధర్నా
ABN , First Publish Date - 2022-01-24T17:34:30+05:30 IST
తమ సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 12న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నామని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు హన్మంత్రావు, నవాత్ సురేష్ తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను మానసిక క్షోభకు గురిచేస్తున్న
హైదరాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 12న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నామని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు హన్మంత్రావు, నవాత్ సురేష్ తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను మానసిక క్షోభకు గురిచేస్తున్న జీవో 317ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవోకు చేయవలసిన సవరణలను పట్టించుకోకుండా, సీనియారిటీ ఆధారంగా జిల్లాల కేటాయింపు జరిపారని గుర్తు చేశారు. దీనిని నిరసిస్తూ ఫిబ్రవరి 12న ధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు.