టీచర్లను భయభ్రాంతులకు గురిచేశారు: ప్రభాకర్
ABN , First Publish Date - 2021-03-06T00:39:48+05:30 IST
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో టీచర్లను మంత్రులు భయభ్రాంతులకు గురి
హైదరాబాద్: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో టీచర్లను మంత్రులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఈ రోజు సీఈవో శశాంక్ గోయల్ను బీజేపీ బృందం కలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి టీఆర్ఎస్ పాల్పడుతోందని సీఈవోకు ఫిర్యాదు చేసింది. ఓటర్లను అధికార పార్టీ నేతలు ప్రభావితం చేస్తున్నారని ప్రభాకర్ పేర్కొన్నారు. ఓ వర్గానికి చెందిన ఓట్లను రాబట్టేందుకే సీఎం యాదాద్రి పర్యటన చేశారని ఆయన తెలిపారు. ఓ సమావేశంలో టీచర్లను మంత్రి నిరంజన్రెడ్డి భయభ్రాంతులకు గురిచేశారని ప్రభాకర్ ఆరోపించారు.