విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా బోధన

ABN , First Publish Date - 2020-04-09T11:06:20+05:30 IST

మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల ప్రిన్సిపాళ్లు తమ కళాశాలలో వివిధ కోర్సులు

విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా బోధన

ఎంజీయూ రిజిస్ట్రార్‌ యాదగిరి


నల్లగొండ క్రైం, ఏప్రిల్‌ 8: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల ప్రిన్సిపాళ్లు తమ కళాశాలలో వివిధ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు విద్యా సంవత్సరం వృథా కాకుండా ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలు బోధించాలని ఎంజీయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ యాదగిరి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తెలిపారు. వివిధ సబ్జెక్టులు బోధిస్తున్న అధ్యాపకులు ఆయా సబ్జెక్టుల సిలబ్‌సను అనుసరించి పవర్‌పాయింట్‌ స్లైడ్స్‌ ద్వారా కానీ పీడీఎ్‌ఫల రూపంలో కానీ వర్డ్‌ డాక్యుమెంట్‌, యూట్యూబ్‌లో ఉన్న పాఠశాల లింక్‌లను విద్యార్థులకు పంపడం ద్వారా ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహించాలని అన్నారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, యూనివర్సిటీ వీసీ ఆదేశాల ప్రకారం సంబంధిత ఏర్పాట్లు చేసుకోవాలని ప్రిన్సిపాళ్లకు సూచించారు. 

Updated Date - 2020-04-09T11:06:20+05:30 IST