మానవ హక్కుల నేత జయశ్రీకి కన్నీటి వీడ్కోలు

ABN , First Publish Date - 2021-08-02T08:03:48+05:30 IST

మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాకుమాని జయశ్రీ (61) శనివారం రాత్రి హైదరాబాద్‌లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయాన్ని ఆదివారం

మానవ హక్కుల నేత జయశ్రీకి కన్నీటి వీడ్కోలు

ప్రొద్దుటూరు అర్బన్‌, ఆగస్టు 1: మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాకుమాని జయశ్రీ (61) శనివారం రాత్రి హైదరాబాద్‌లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం కడప జిల్లా ప్రొద్దుటూరు శాస్ర్తీనగర్‌లోని ఆమె స్వగృహానికి తీసుకొచ్చారు. పలువురు ప్రముఖులు జయశ్రీ భౌతికకాయాన్ని సందర్శించి సంతాపం తెలిపారు.  ఉభయ తెలుగు రాష్ట్రాల మానవ హక్కుల నేతలు ప్రొద్దుటూరుకు తరలివచ్చి అంతిమ వీడ్కోలు పలికారు. సాయంత్రం 4 గంటలకు ఆమె భౌతికకాయాన్ని ప్రజాసంఘాల నేతలు వైకుంఠ రథంలో ఊరేగింపుగా ఎర్రగుంట్ల రోడ్డులోని ఆర్యవైశ్య హిందూ శ్మశాన వాటికకు తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు.

Updated Date - 2021-08-02T08:03:48+05:30 IST